సభ్యుడు
డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(2018), గుంటూరు.
జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(2018-2020), దక్షిణ మధ్య రైల్వే
చరవాణి - 9550 139 139
ఎర్రుపాలెం- నంబూరు (వయా-అమరావతి) నూతన రైల్వేలైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ ఈ ప్రాజెక్టును, ప్రజోపయోగం కోసం జాతీయ మౌలిక వసతులను కల్పించే ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ.
అమరావతి రైల్వే లైన్ నిర్మాణంలో నాందిగా ఇదొక తొలిఅడుగు.
ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన పలు ఎక్స్ ప్రెస్ రైళ్లలో, క్రింద పేర్కొనబడిన విధంగా, నిర్ణీత తేదీల నుండి అదనపు జనరల్ బోగీలు ఏర్పాటు చేయబడుచున్నవి.
ఈ ఏర్పాటు వల్ల జనరల్ బోగీలలో ప్రస్తుతం నెలకొన్న ప్రయాణీకుల రద్దీ, కొంతమేర నివారించబడే అవకాశం ఉంది.
ప్రస్తుత రైల్వేస్టేషన్ల వర్గీకరణ (2016-17 వార్షిక గణాంకాల మేరకు) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన రైల్వేస్టేషన్ల దినసరి సగటు ప్రయాణీకుల సంఖ్య, వార్షిక ఆదాయం, ప్రయాణీకుని నుండి సగటు ఆదాయం వివరాలు.
వినాయకచవితి నేపథ్యంలో నేటి నుండి, అధునాతన LHB బోగీలతో రాకపోకలు ప్రారంభించిన రైలు నం. 07202 సికింద్రాబాద్-గుంటూరు (గోల్కొండ) ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు. రేపటి నుండి LHB బోగీలతో నడవనున్న రైలు నం. 07201 గుంటూరు-సికింద్రాబాద్ (గోల్కొం���) ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.
చిత్రసౌజన్యం-మనీష్
8-ఏప్రిల్-2023 నాడు ప్రారంభం కానున్న, రైలు నం. 20701/20702 సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (వయా - నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు) వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు.
మంగళవారం మినహా, వారంలో మిగిలిన 6 రోజులు నడవనున్న ఈ రైలు.
రైలు నం. 22203/22204 విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపచ్నం దురంతో ఎక్స్ ప్రెస్ (ట్రైవీక్లీ), రైలు నం. 12513/12514 సికింద్రాబాద్-గౌహతి-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (వీక్లీ) రైళ్ళను పగిడిపల్లి-నడికుడి-గుంటూరు-విజయవాడ మీదుగా మళ్ళించాలన్న ప్రతిపాదనకు రైల్వే బోర్డు ఆమోదం.
విజయవాడ-గూడూరు మధ్య రైళ్ళ రద్దు గురించి, గుంటూరు పార్లమెంటు సభ్యులు
@PemmasaniOnX
గారి లేఖకు స్పందించిన దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, విజయవాడ-గూడూరు-విజయవాడ మధ్యనడిచే విక్రమ సింహపురి ఎక్స్ప్రెస్ రైలును 17వ తేదీ నుండి పునరుద్ధరించాలని నిర్ణయించారు.
📢📢
Due to Non- Interlocking Works for commissioning of 3rd line between Appikatla¬Nidubrolu-Tsundur stations of Vijayawada-Gudur section, the following trains are being Cancelled/ Diverted/ Rescheduled as follows
@SCRailwayIndia
@DrmChennai
@DRMWaltairECoR
@drmgnt
గుంటూరు-నంద్యాల మీదుగా, 23 బోగీలతో, వారాంతంలో నడవనున్న రైలు నం. 07687/07688 నరసాపూర్-యశ్వంతపూర్-నరసాపూర్ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.
ఆదివారం నాడు బెంగుళూరు వైపు ఉండే అదనపు రద్దీ నేపధ్యంలో, ఈ రైలు వలన, విజయవాడ & గుంటూరు డివిజన్ల పరిధిలో ప్రయాణీకులకు కొంతమేర సౌకర్యం ఏర్పడనున్నది.
దయచేసి రైలు నందు అలారం చైన్ అనవసరంగా వినియోగించకండి.
అలారం చైన్ లాగిన తదనంతరం సిబ్బంది కష్టాలకు ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం.
రైలు నం. 02728 హైదరాబాద్-విశాఖపట్నం
ప్రాంతం : హుస్సేన్ సాగర్ జంక్షన్ సమీపాన
సహాయ లోకోపైలట్ శ్రీ అనుజ్ కుమార్ పాండే గారికి అభినందనలు.
గుంటూరు-నంద్యాల మార్గం నుండి తిరుపతికి నేరుగా రైలు సౌకర్యం కల్పించాలన్న ప్రతిపాదనలకు కార్యరూపం.
18-ఆగస్ట్-2022 నుండి వర్తింపుతో (నంద్యాల మీదుగా) పునరుద్దరించబడనున్న రైలు నం. 17261/17262 గుంటూరు-తిరుపతి-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలు.
విజయవాడ డివిజన్ పరిధిలో సామర్లకోట-నిడదవోలు మధ్య రైళ్ళ రద్దీ అధికంగా ఉన్న నేపధ్యంలో, రూ. 145.85 కోట్ల అంచనా వ్యయంతో సామర్లకోట-కొవ్వూరు-పూళ్ళ మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్ధ ఏర్పాటు పనులు త్వరలో ప్రారంభం కానున్నవి.
ఈ రోజు సాయంత్రం తూర్పుకోస్తారైల్వే ఉన్నతాధికారుల తో చర్చించిన మేరకు,
రైలు నం. 22701 విశాఖపట్నం-గుంటూరు ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలుకు, రేపటి నుండి -
అనకాపల్లి
సామర్లకోట
రాజమండ్రి
తాడేపల్లిగూడెం
ఏలూరు
విజయవాడ
రైల్వే స్టేషన్లలో కరెంట్ బుకింగ్ సౌకర్యం కల్పించబడినది.
గుంటూరు-గుంతకల్ మీటర్ గేజ్ రైలుమార్గ నిర్మాణంలో భాగంగా, నల్లమల అటవీప్రాంతంలో దిగువమెట్ట-చెలమ రైల్వేస్టేషన్ల మధ్య నిర్మితమైన దొరబావి రైలువంతెనను పటిష్ఠపరిచే క్రమంలో భాగంగా, 1931వ సంవత్సరం నాడు ఈ వంతెన మధ్య స్పాన్ కు ఐకానిక్ అండర్-స్లంగ్ ఆర్చి ఏర్పాటు చేసినప్పటి ఛాయాచిత్రం.
17-మే-2023 నుండి, సవరించబడిన సమయపట్టిక ప్రకారం, 16 బోగీలతో నడవనున్న రైలు నం. 20701/20702 సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు.
ఇకపై ఇరువైపుల 08:15 గంటల వ్యవధిలో గమ్యస్ధానానికి చేరనున్న ఈ రైలు.
8-ఏప్రిల్-2023 నాడు ప్రారంభం కానున్న, రైలు నం. 20701/20702 సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (వయా - నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు) వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు.
మంగళవారం మినహా, వారంలో మిగిలిన 6 రోజులు నడవనున్న ఈ రైలు.
గిద్దలూరు-నంద్యాల మధ్య ఘాట్ సెక్షన్ లో ట్రాక్ మరమ్మత్తుల కారణంగా, పగటి వేళల్లో నడిచే పలు రైళ్ళ రద్దు వల్ల ఏర్పడే ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా, గుంటూరు-తిరుపతి- గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలును (మరో 7 అదనపు జనరల్ బోగీలతో) 24 బోగీల గరిష్ఠ సామర్థ్యంతో నడపాలని సంబంధిత అధికారులను కోరటమైనది.
1-అక్టోబర్-2023 నుండి వర్తింపుతో, నేరుగా వికారాబాద్ వరకు నడవనున్న, రైలు నంబర్ 17626 రేపల్లె-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైలు.
ఈ మార్పు వల్ల, ఇకపై రేపల్లె నుండి బేగంపేట, సనత్ నగర్, హఫీజ్ పేట, లింగంపల్లి తదితర ప్రాంతాలకు, నేరుగా రిజర్వేషన్ టికెట్లు పొందగలిగే అవకాశం ఏర్పడనున్నది.
మచిలీపట్నం-విజయవాడ-మచిలీపట్నం మార్గంలో, ఈ రోజు నుండి ప్రారంభం కానున్న విద్యుత్ లోకోమోటివ్స్ (ఇంజన్ల) వినియోగం.
ఇకపై కొండవీడు రైలు పూర్తి ప్రయాణం విద్యుత్ ఇంజన్ తోనే..
మచిలీపట్నం-విజయవాడ-మచిలీపట్నం మధ్య బీదర్ రైలు ప్రయాణం విద్యుత్ ఇంజన్ తోనే..
నల్లపాడు-పగిడిపల్లి, మేడ్చల్-నాగర్సోల్ సింగిల్ లైన్ మార్గాలలో రద్దీ నివారణ & ప్రయాణకాలం తగ్గింపునకు వీలుగా, రైలు నం. 17231 నరసాపూర్-నాగర్సోల్ ఎక్స్ ప్రెస్ రైలు సమయపట్టిక సవరింపు అంశాన్ని పరిశీలించాల్సిందిగా, సంబంధిత అధికారులను కోరడమైనది.
01-సెప్టెంబర్-2023 నాడు భువనేశ్వర్ లో తూర్పుకోస్తారైల్వే ఉన్నతాధికారులతో చర్చించిన మేరకు -
10-సెప్టెంబర్-2023 నుండి వర్తింపుతో, రైలు నం. 12805/12806 జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలుకు, 2 ఏసి త్రీటైర్ ఎకానమీ బోగీలు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయబడినవి.
23-ఆగస్ట్-2023 నుండి వర్తింపుతో, రైలు నం. 12805 విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్, రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది.
గుంటూరు కోటా, ఏసి చైర్ కార్ నందు 6 నుండి 21 సీట్లకు, సెకండ్ సిట్టింగ్ నందు 200 నుండి 451 సీట్లకు పెంపు.
జనవరి 9వ తేదీ నుండి, గుంటూరు రైల్వేడివిజన్ పరిధిలో 3 రైళ్ళ పొడిగింపు..
1. హుబ్లి-విజయవాడ-హుబ్లి అమరావతి ఎక్స్ ప్రెస్ రైలు, నరసాపూర్ వరకు.
2. విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలు, గుంటూరు వరకు.
3. నంద్యాల-కడప-నంద్యాల డెము, రేణిగుంట వరకు.
శబరిమలై వెళ్ళు అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం, గుంటూరు-నంద్యాల-యర్రగుంట్ల-తిరుపతి మీదుగా నడవనున్న రైలు నం. 07143/07144 నరసాపూర్-కొట్టాయం-నరసాపూర్ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.
గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ ప్రారంభం అనంతరం, ఈ ప్రత్యేక రైలు వల్ల మరిన్ని ప్రాంతాలతో తొలిసారి అనుసంధానం.
భవానీ దీక్షల విరమణ & సంక్రాంతి సెలవుల నేపధ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా, గుంటూరు-రాయగడ & గుంటూరు-తిరుపతి రైళ్ళకు అదనపు బోగీల ఏర్పాటు, గుంటూరు-శ్రీకాకుళం రోడ్/పలాస-గుంటూరు మధ్య రాత్రివేళ ప్రత్యేక ఇంటర్ సిటీ రైలు నడపాల్సిందిగా సంబంధిత అధికారులను కోరటమైనది.
ఈ రోజు చెన్నై-మైసూరు మధ్య ప్రయోగాత్మకంగా నడిచిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ రైలు.
ఈ రైలు సర్వీసు త్వరలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నది.
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పునరుద్ధరణ
21-జూలై-2024 నుండి
రైలు నం. 17282 నరసాపూర్-గుంటూరు ఎక్స్ ప్రెస్
రైలు నం. 17227 గుంటూరు-డోన్ ఎక్స్ ప్రెస్
22-జూలై-2024 నుండి
రైలు నం. 17228 డోన్-గుంటూరు ఎక్స్ ప్రెస్
రైలు నం. 17281 గుంటూరు-నరసాపూర్ ఎక్స్ ప్రెస్
రాష్ట్రప్రభుత్వ వాటా నిధుల చెల్లింపు లేమి కారణంగా నిలిచిపోయిన నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైల్వే లైన్ పనుల పునఃప్రారంభానికి మార్గం సుగమం.
అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వనుండగా, పూర్తిగా రైల్వేశాఖ నిధులతో ఈ నూతన రైలుమార్గ నిర్మాణం జరగనున్నది.
రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు జరగని కారణంగా, నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలుమార్గ మూడో దశ పనులు నిలచిపోయే అవకాశం.
రాష్ట్ర ప్రభుత్వ నిధుల కేటాయింపు అనంతరం మాత్రమే కనిగిరి-వెంకటగిరి మధ్య ప్రారంభం కానున్న మూడోదశ పనులు.
ఈ నూతన రైలుమార్గ విద్యుద్దీకరణ పనులకు సైతం నిధుల మంజూరు.
తిరువణ్ణామలై (అరుణాచలం), శ్రీరంగం, మదురై తదితర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ, గుంటూరు మీదుగా వారాంతంలో నడవనున్న, రైలు నం. 07435/07436 కాచిగూడ-నాగర్ కోయిల్-కాచిగూడ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.
దీనివల్ల ఆదివారం నాడు గుంటూరు నుండి జంటనగరాలకు మరో ప్రత్యేక రైలు.
నిన్న గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ మోహన్ రాజా గారిని కలిసి, పలు విషయాలపై చర్చించటమైనది.
విజయవాడ-గుంటూరు మధ్య ప్రయాణకాల తగ్గింపు కొరకు, కృష్ణాకెనాల్ జంక్షన్ కు ప్రత్యామ్నాయంగా, తాడేపల్లి గూడ్స్ షెడ్ (పాత మీటర్ గేజ్) మీదుగా రైలుమార్గం నిర్మాణం అంశం పరిశీలించాలని కోరటమైనది.
విజయవాడ-దువ్వాడ రైలు మార్గంలో, ప్రస్తుతం ఉన్న ప్రయాణీకుల రైళ్ళ గరిష్ట వేగ పరిమితిని, గంటకు 110 కిలోమీటర్ల నుండి గంటకు 130 కిలోమీటర్లకు పెంచడానికి, ఆమోదం తెలిపిన రైల్వే భద్రతా కమీషనర్.
పరిపాలనాపరమైన ప్రక్రియలు పూర్తైన అనంతరం, త్వరలో అమలు కానున్న ప్రయాణీకుల రైళ్ళ వేగపరిమితి పెంపు.
#భారతీయరైల్వే #ఆసక్తికరవిషయాలు
సాధారణ సిగ్నల్స్ మాదిరిగా కాకుండా, విధ్యుత్ స్తంభాలకు అమర్చబడిన సిగ్నల్స్ ను గ్యాంట్రీ సిగ్నల్స్ గా వ్యవహరిస్తారు. భారతీయరైల్వే లో ఇవి చాలా అరుదుగా ఏర్పాటు చేయబడతాయి.
ఈ చిత్రంలోని గ్యాంట్రీ సిగ్నల్ కొవ్వూరు రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేయబడినది.
రూ. 2,853.23 కోట్ల అంచనా వ్యయంతో, గుంటూరు-బీబీనగర్ (230 కి.మీ) డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.
రూ. 4,686.09 కోట్ల అంచనా వ్యయంతో, డోన్-మహబూబ్ నగర్ & మేడ్చల్-ముద్ఖేడ్ (417.88 కి.మీ) డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.
@rajeevreddy747
@sesh_laksh
There was no fund allocation in last year budget, for Guntur-Bibinagar doubling.
Based on priorities, respective authorities will come up with appropriate plan, to utilize funds allotted in recent budget.
గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ పనులలో భాగంగా, సుమారు 647.88 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, కుక్కడం-నడికుడి మధ్య 48 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నవి.
ఇందులో భాగంగా, ఈ మార్గంలో గల వంతెనలలో కీలకమైన కృష్ణానది వంతెన నిర్మాణం, సుమారు 30 నెలల కాలపరిమితితో జరగనున్నది.
విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మితమైన మొదటి రైలు వంతెన ఛాయాచిత్రం (1898).
ఈ వంతెన డ్యూయల్ గేజ్ రైలుమార్గాన్ని కలిగి ఉండేది.
17.03.1893 న మీటర్ గేజ్ ప్రారంభం కాగా, 15.07.1897న బ్రాడ్ గేజ్ గూడ్స్ రైళ్ళు, మరియు 1899వ సంవత్సరంలో బ్రాజ్ గేజ్ ప్రయాణీకుల రైళ��ళ రాకపోకలు ప్రారంభం అయ్యాయి.
విజయవాడ నుండి సికింద్రాబాద్ (శాతవాహన), విశాఖపట్నం (రత్నాచల్), ��ెన్నై (పినాకిని), తిరుపతి (తిరుమల), విజయవాడ-బెంగుళూరు (వయా-గుంటూరు, గుంతకల్), తిరుపతి-గుంతకల్, విజయవాడ-నరసాపూర్ రైళ్ళ పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే కు సూచించినది.
దక్షిణమధ్యరైల్వే పరిధిలో రైళ్ళ పునరుద్ధరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ అనుమతి విషయమై, నేడు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కృష్ణబాబు గారిని సంప్రదించటమైనది.
ఈ విషయమై వారు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి గారితో చర్చించిన అనంతరం, రైల్వేశాఖకు సమాచారం పంపుతామని తెలియజేశారు.
భవిష్యత్ అవసరాల దృష్ట్యా, నల్లపాడు-గుంటూరు-కృష్ణాకెనాల్ మధ్య ప్రస్తుతం ఉన్న రెండు రైల్వేలైన్లకు అదనంగా, మరో రెండు (మూడవ మరియ నాలుగవ) రైల్వేలైన్ల నిర్మాణానికి సంబంధించి, ఫైనల్ లొకేషన్ సర్వే పనులు త్వరలో ప్రారంభమై, 4 నెలల కాలవ్యవధిలో పూర్తికానున్నాయి.
విజయవాడ-కొండపల్లి మధ్య మూడవ రైల్వేలైన్ ఏర్పాటుకు సంబంధించిన నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా, ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 21 వరకు, గుంటూరు డివిజన్ పరిధిలో పాక్షికంగా రద్దు చేయబడుతున్న మరియు గుంటూరు డివిజన్ మీదుగా దారి మళ్ళించబడుతున్న పలు రైళ్ళ వివరాలు.
Today's Train No. 02748 Vikarabad-Guntur (Palnadu) Special Express had reached Guntur 40 minutes before time.
It had covered 281 Km (Secunderabad-Guntur) within 04:14 hours (with 8 enroute stoppages), with an average speed of 66.38 KM/Hour.
Excellent job done by
@GntOperating
రైలు నం. 02625/02626 త్రివేండ్రం-న్యూఢిల్లీ-త్రివేండ్రం (కేరళ) సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు, 30.09.2020 నుండి ప్రతిరోజు నడవనున్నది.
రామగుండం, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుండి శబరిమలై యాత్రకు వెళ్ళే వారికి, అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభం కానున్నది.
మార్గమధ్యంలో అధిక సమయం పాటు నిలుపుదల నివారణ & ప్రయాణీకుల సౌకర్యం కొరకు, గుంటూరు-రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ సమయపట్టిక సవరణకు తగిన సహకారం అందించాలని, తూర్పుకోస్తారైల్వే ఉన్నతాధికారులను కోరటమైనది.
గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ పనులలో భాగంగా, నల్లమల అభయారణ్యం నందు ఎంతో కీలకమైన బొగద & చెలమ వద్ద నూతన సొరంగాలు, వాటికి అనుసంధానించే అప్రోచ్ నిర్మాణాలకు సంబంధించి, సుమారు 126.95 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ మొదలైనది. సుమారు 2.5 సంవత్సరాల వ్యవధిలో ఈ పనులు పూర్తికావచ్చు.
శబరిమలై యాత్రికుల రద్దీ దృష్ట్యా, రానున్న 2 వారాలలో గుంటూరు/న్యూగుంటూరు మీదుగా నడవనున్న పలు ప్రత్యేక రైళ్ళ వివరాలు.
రేపు ఉదయం 8 గంటలకు అందుబాటులోకి రానున్న రిజర్వేషన్ సౌకర్యం.
నిజామాబాద్/ఆర్మూరు/కోరుట్ల/జగిత్యాల/కరీంనగర్ నుండి తొలిసారి న్యూగుంటూరు మీదుగా శబరిమలై ప్రత్యేక రైలు.
గుంటూరు మీదుగా, డిసెంబర్ మాసాంతం వరకు నడవనున్న సికింద్రాబాద్-రామేశ్వరం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు.
గుంటూరు నుండి తిరువణ్ణామలైై, చిదంబరం, కుంబకోణం, తంజావూరు, రామేశ్వరం తదితర పర్యాటక ప్రాంతాలకు నేరుగా రైలు సౌకర్యం.
గుంటూరు మీదుగా, అక్టోబర్ వరకు నడవనున్న హైదరాబాద్-రామేశ్వరం-హైదరాబాద్ వారాంతపు ప్రత్యేక రైలు.
వారాంతపు సెలవుదినాలలో, హైదరాబాద్ నుండి గుంటూరు వచ్చి తిరిగి వెళ్లే వారికి, మరియు గుంటూరు నుండి రేణిగుంట(తిరుపతి), వెల్లూరు (గోల్డెన్ టెంపుల్) వెళ్ళి వచ్చే వారికి సౌకర్యవంతంగా సమయపట్టిక.
గుంటూరు యార్డు రీమోడలింగ్ సహా, నల్లపాడు-గుంటూరు మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు కొరకు సంబంధించి, రూ. 14.03 కోట్ల అంచనా వ్యయంతో సిగ్నలింగ్ ఏర్పాట్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
దీంతో రైళ్ళ రాకపోకలు మరింత సులభతరంగా మారటమే కాక, అదనపు రైళ్ళకు అవకాశం కలగనుంది.
న్యూగుంటూరు మీదుగా నడుస్తున్న రైలు నం. 16031 చెన్నై - శ్రీమాతావైష్ణోదేవి కాత్రా అండమాన్ ఎక్స్ ప్రెస్ రైలుకు, న్యూగుంటూరు నుండి రిజర్వేషన్ లభ్యత పెరిగే విధంగా, రిజర్వేషన్ కోటా సవరణకు దక్షిణరైల్వే ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ మార్పులు 120 రోజుల తర్వాత నుండి అమలులోకి రానున్నాయి.
రైలు నం. 17247/17248 నరసాపూర్-ధర్మవరం-నరసాపూర్ లింక్ ఎక్స్ ప్రెస్, రైలు నం. 57264/57265 నరసాపూర్-విశాఖపట్నం-నరసాపూర్ లింక్ ప్యాసింజర్ లను (లింక్ రైళ్ళుగా కాకుండా) పూర్తిస్థాయి రైళ్ళుగా నడపాలని రైల్వే బోర్డు నిర్ణయం.
డబ్లింగ్ అనంతరం మరిన్ని రైళ్ళు భీమవరం టౌన్ మీదుగా నడిచే అవకాశం.
29-అక్టోబర్-2005 నాడు వలిగొండ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నం. 415 రేపల్లె-సికింద్రాబాద్ ఫాస్ట్ ప్యాసింజర్ ఘోర ప్రమాదానికి గురై, నేటికి పదిహేను సంవత్సరాలు.
ఎన్నో లోటుపాట్లు ఎత్తిచూపిన ఈ దుర్ఘటనలో, రైలు లోకోపైలట్ సహా 114 మంది మృత్యువాత పడగా, అనేక మంది క్షతగాత్రులు అయ్యారు.
గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ పనులలో భాగంగా, సుమారు 853.09 కోట్లరూపాయల అంచనా వ్యయంతో, వలిగొండ-కుక్కడం మధ్య 75 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు త్వరలో ప్రారంభంకానున్నవి.
వలిగొండ వద్ద మూసీవంతెన నిర్మాణం సహా ఈ డబ్లింగ్ పనులు సుమారు 33 నెలల కాలపరిమితితో జరగనున్నవి.
గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ పనులలో భాగంగా, సుమారు 647.88 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, కుక్కడం-నడికుడి మధ్య 48 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నవి.
ఇందులో భాగంగా, ఈ మార్గంలో గల వంతెనలలో కీలకమైన కృష్ణానది వంతెన నిర్మాణం, సుమారు 30 నెలల కాలపరిమితితో జరగనున్నది.
నిర్ణీత అనుమతుల లభ్యత మేరకు, రైలు నం. 20805/20806 విశాఖపట్నం-న్యూఢిల్లీ-విశాఖపట్నం ఏ.పి ఎక్స్ ప్రెస్ రైలునకు, ఈ రోజు నుండి 6 స్లీపర్ క్లాస్ బోగీలు ఏర్పాటు చ��యబడనున్నాయి.
తిరుపతి రైల్వే స్టేషన్ నందు దక్షిణ వైపు ప్రవేశ మార్గం మరియు 6వ ప్లాట్ ఫామ్ ఏర్పాటుకు సంబంధించిన పనుల కారణంగా, ఈరోజు రాత్రి విశాఖపట్నం నుండి బయలుదేరనున్న రైలు నం. 02707 విశాఖపట్నం-విజయవాడ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు, రేణిగుంట-తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేయబడినది.
ఈరోజు నుండి రైలు నం. 17253/17254 గుంటూరు-కాచిగూడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలు, ప్రస్తుత డెము రేక్ నకు బదులుగా, ICF రేక్ తో అన్ రిజర్వుడ్ ఎక్స్ ప్రెస్ రైలుగా నడవనున్నది.
దిగువ పేర్కొనబడిన సమయపట్టిక మేరకు, ఈ రైలు ఈరోజు నుండి సికింద్రాబాద్ వరకు పొడిగించబడినది.
@maheshravela
Proposed running of Train No. 17253/17254 Guntur-Kacheguda-Guntur Express, with conventional (instead of DEMU) rake is already taken up with concerned officials.
Hopefully, it may likely to be materialised very soon.
@gntrailusersasn
రైలు నం. 17229 త్రివేండ్రం-సికింద్రాబాద్ శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు, గుంటూరు రైల్వేస్టేషన్ నందు కరెంట్ బుకింగ్ సౌకర్యం కల్పించాలని దక్షిణరైల్వే ఉన్నతాధికారులను కోరగా, వారి అంగీకారంతో 16-ఏప్రిల్ నుండి, ఈరైలుకు గుంటూరు రైల్వేస్టేషన్ నందు కరెంట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి రానున్నది.
Requested
@SWRRLY
to run Train No. 17319/17330 Hubli-Vijayawada-Hubli Express, with approved coach composition of 16 coaches.
Operating this train with 13 coaches is endangeeing safety & lives of passengers, due to overcrowding & passengers are forced to travel on footboards.
శబరిమలై యాత్రికుల సౌకర్యార్ధం నడవనున్న రైలు నం. 07117/07118 సికింద్రాబాద్-కొట్టాయం-సికింద్రాబాద్ (వయా - కర్నూలు సిటీ), మరియు రైలు నం. 07119/07120 నరసాపూర్-కొట్టాయం-నరసాపూర్ (వయా - తిరుపతి) వీక్లీ ప్రత్యేక రైళ్ళ వివరాలు.
ఈ రైళ్ళకు రిజర్వేషన్ సౌకర్యం త్వరలో అందుబాటులోకి రానున్నది.
రైలు నం. 17255/17256 నరసాపూర్-హైదరాబాద్-నరసాపూర్ ఎక్స్ ప్రెస్ ను, హైదరాబాద్ కు బదులు (బేగంపేట స్టేషన్ నందు నిలుపుదల సౌకర్యంతో) లింగంపల్లి వరకు నడపాలన్న ప్రతిపాదనకు రైల్వే బోర్డు ఆమోదం. దీంతో గుంటూరు మీదుగా నడుస్తున్న రైళ్ళలో, లింగంపల్లి వరకు పొడిగించబడిన రైళ్ళ సంఖ్య 4 కు చేరింది.
అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందనకు వీలుగా, గుంటూరుకు కేటాయించబడిన అధునాతన స్వీయ చోదక ప్రమాద ఉపశమన రైలు, ఈ రోజు గుంటూరుకు చేరుకున్నది.
ఈ రైలులో సహాయక సాధనాలు, వైద్య సహాయం, మరియు పర్యవేక్షకుల కొరకు వేర్వేరుగా మూడు బోగీలు (ఇంజన్/షంటింగ్ అవసరం లేకుండా) ఉన్నాయి.
గంగా పుష్కరాల దృష్ట్యా, భీమవరం టౌన్ మీదుగా నడవనున్న రైలు నం. 07230/07229 గుంటూరు-బనారస్-గుంటూరు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.
తొలిసారిగా ఉభయ గోదావరి జిల్లాల నుండి వారణాసికి నేరుగా రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చినందున, కాశీ యాత్రికులకు మరింత సౌకర్యవంతం.
గంగా పుష్కరాల కోసం వారణాసి వెళ్లే యాత్రికులకు శుభవార్త - నా ప్రత్యేక చొరవ కారణంగా, రైల్వే మంత్రి శ్రీ
@AshwiniVaishnaw
విశాఖపట్నం నుండి వారణాసికి ప్రత్యేక రైళ్లను మంజూరు చేసారు. Good news for Ganga Pushkara pilgrims - Special trains from Visakhapatnam to Varanasi sanctioned.
28-జనవరి-2021 నుండి, తణుకు-భీమవరం మీదుగా వారంలో రెండురోజుల పాటు నడవనున్న, రైలు నం. 08189/08190 టాటానగర్-ఎర్నాకుళం-టాటానగర్ ప్రత్యేక రైలు.
తొలిసారిగా తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ ప్రాంతాల నుండి, వివిధ దూర ప్రాంతాలకు నేరుగా రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చినది.
నేటి నుండి రైలు నంబర్ 12077/12078 చెన్నై-విజయవాడ-చెన్నై జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైలు LHB బోగీలతో నడవనున్నది.
ఈ రైలుకు 2 ఏ.సి.చైర్ కార్, 14 సెకండ్ సిట్టింగ్, 2 పవర్ కార్ బోగీలతో కలిపి మొత్తం 18 బోగీలు ఉండనున్నాయి.
నంద్యాల నుండి బయలుదేరే డెము రైళ్ళ టాయిలెట్స్ నందు నీరు అందుబాటులో ఉంచేందుకు తీసుకున్న చర్యలలో భాగంగా, 42.23 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నంద్యాల రైల్వేస్టేషన్ వద్ద క్యారేజ్ వాటరింగ్ సదుపాయాలు (సివిల్ పనులు) త్వరలో ప్రారంభం కానున్నవి.
నంద్యాల ప్రయాణీకుల చిరకాల కోరిక నెరవేరనున్నది.
రైలు నం. 17226/17225 హుబ్లి-విజయవాడ-హుబ్లి అమరావతి ఎక్స్ ప్రెస్ రైలును, నరసాపూర్ వరకు పొడిగించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన రైల్వేబోర్డు.
గోదావరి ప్రాంత ప్రయాణీకులకు మేలు చేకూర్చనున్న ఈ నిర్ణయం.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు నూతన బైపాస్ రైలుమార్గ పనులకు నిధుల కేటాయింపు వివరాలు.
విజయవాడ, కాజీపేట - 286 కోట్లు
రేణిగుంట, గుత్తి, వాడి - 125 కోట్లు
గుంతకల్ - వెయ్యి రూపాయలు
13-ఏప్రిల్-2022 నుండి పునరుద్ధరించబడనున్న, రైలు నంబరు. 17228/17227 గుంటూరు-డోన్-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలు.
ఏసి చైర్ కార్, సెకండ్ సిట్టింగ్, జనరల్ బోగీలో నడిచే ఈ రైలుకు, సాధారణ మెయిల్/ఎక్స్ ప్రెస్ చార్జీలు వర్తించనున్నాయి.
రైలు నం. 22701/22702 విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలును, గుంటూరు వరకు పొడిగించాలన్న ప్రతిపాదనకు రైల్వేబోర్డు ఆమోదముద్ర.
త్వరలో కార్యరూపం దాల్చనున్న పొడిగింపు.
విజయవాడ-గూడూరు ట్రిప్లింగ్ లో భాగంగా, కావలి-ఉలవపాడు (28 కి.మీ) మధ్య నూతనంగా నిర్మితమైన మూడవ రైల్వేలైన్ ను, రైల్వే భద్రతా కమీషనర్ రేపు (27-మార్చి-2021 నాడు) తనిఖీ చేయనున్నారు.
ఈ తనిఖీ మరియు తదనంతర అనుమతుల మేరకు, మూడవ రైలు మార్గం రైళ్ళ రాకపోకలకు అందుబాటులోకి రానున్నది.
జనవరి 12వ తేదీన, గుంటూరు రైల్వేడివిజన్ పరిధిలో 3 రైళ్ళ పొడిగింపు.
1. హుబ్లి-విజయవాడ-హుబ్లి అమరావతి ఎక్స్ ప్రెస్ రైలు, నరసాపూర్ వరకు.
2. విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలు, గుంటూరు వరకు.
3. నంద్యాల-కడప-నంద్యాల డెము, రేణిగుంట వరకు.
జనవరి 9వ తేదీ నుండి, గుంటూరు రైల్వేడివిజన్ పరిధిలో 3 రైళ్ళ పొడిగింపు..
1. హుబ్లి-విజయవాడ-హుబ్లి అమరావతి ఎక్స్ ప్రెస్ రైలు, నరసాపూర్ వరకు.
2. విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైలు, గుంటూరు వరకు.
3. నంద్యాల-కడప-నంద్యాల డెము, రేణిగుంట వరకు.
12-అక్టోబర్-2020 నుండి గుంటూరు, నంద్యాల మీదుగా రాకపోకలు సాగించనున్న రైలు నం. 08463/08464 భువనేశ్వర్-బెంగుళూరు-భువనేశ్వర్ (ప్రశాంతి) ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.
త్వరలో అందుబాటులోకి రానున్న రిజర్వేషన్ సౌకర్యం.
@Guntur_Shiva
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు
@ncbn
గారి సూచనల మేరకు, దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజర్
@gmscrailway
సహా పలువురు రైల్వే ఉన్నతాధికారులు, త్వరలో అమరావతి సచివాలయానికి విచ్చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వేప్రాజెక్టుల గురించి సమీక్షించనున్నారని విశ్వసనీయ సమాచారం.
30-మార్చి-2024 (శనివారం) నాడు సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుండి బయలుదేరనున్న, రైలు నం. 07049 విజయవాడ-దిమాపూర్ ప్రత్యేక రైలు.
ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం, ఈ రోజు ఉదయం 8 గంటలకు అందుబాటులోకి వచ్చినది.
గుంటూరు మీదుగా వారంలో 3 రోజుల పాటు నడవనున్న, రైలు నం. 07067/07068 మచిలీపట్నం-మంత్రాలయం రోడ్-మచిలీపట్నం (వయా - కర్నూలు, గద్వాల, రాయచూర్) ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.
దీనివల్ల రాయచూరు & మంత్రాలయం రోడ్ నకు నేరుగా రైలు సౌకర్యం పునరుద్దరణ.
సవరించబడిన సమయపట్టికతో, మార్చి నెలలో నడవనున్న రైలు నం. 07067/07068 మచిలీపట్నం-కర్నూలు సిటీ-మచిలీపట్నం ట్రై-వీక్లీ ప్రత్యేక రైలు.
మచిలీపట్నం/గుడివాడ/విజయవాడ/గుంటూరు నుండి నంద్యాల/డోన్/కర్నూలుకు, అందుబాటులోకి రానున్న మరింత సౌకర్యవంతమైన రాత్రివేళ ప్రయాణం.
14-అక్టోబర్-2020 నుండి న్యూగుంటూరు మీదుగా నడవనున్న , రైలు నం. 02708/02707 తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి డబల్ డెక్కర్ ఏ.సి. ప్రత్యేక ట్రైవీక్లీ రైలు.
న్యూగుంటూరు నుండి
విశాఖపట్నంకు (సోమ, గురు, శని వారాలలో) ఉదయం 03:40 గంటలకు.
తిరుపతికు (మంగళ, శుక్ర, ఆది వారాలలో) ఉదయం 04:55 గంటలకు.
జాతీయ రైల్వే ప్రణాళిక
జిల్లాల వారీగా ప్రయాణీకుల సంఖ్య ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో ప్రధాన స్టేషన్ల ఆధునికీకరణ
గడువు - జిల్లా - వ్యయం (కోట్లలో)
2026 - గుంటూరు - 283
2026 - కృష్ణా - 323
2031 - చిత్తూరు - 291
2041 - విశాఖపట్నం - 302
2051 - నెల్లూరు - 174
2051 - తూర్పు గోదావరి - 180
నీట్ పరీక్ష దృష్ట్యా, సెప్టెంబర్ 12, 13 తేదీలలో రైలు నం. 07631/07632 గూడూరు-విజయవాడ-గూడూరు (వయా-న్యూగుంటూరు) స్పెషల్ ఎక్స్ ప్రెస్, రైలు నం. 07433/07433 విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ (వయా-ఏలూరు) స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు నడవనున్నాయి.
ఈ రైళ్ళు స్లీపర్ క్లాస్ బోగీలతో నడవనున్నాయి.
దక్షిణమధ్యరైల్వే పరిధిలో పలు (23) ప్రధానరైళ్ల పునరుద్ధరణకు ఆమోదం తెలిపిన రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోచింగ్).
తదనుగుణంగా గుంటూరు డివిజన్ నుండి నడవనున్న ప్రత్యేక రైళ్లు
కాచిగూడ-రేపల్లె-సికింద్రాబాద్
గుంటూరు-రాయగడ-గుంటూరు
సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్ (వయా-ఖమ్మం)
తూర్పుకోస్తారైల్వే కు 16 బోగీలు గల వందే భారత్ రైలు కేటాయిస్తూ రైల్వేబోర్డు ఆదేశాలు.
త్వరితగతిన ఈ రైలును సికింద్రాబాద్ (దక్షిణమధ్యరైల్వే) కు పంపాల్సిందిగా, చెన్నై లోని సమగ్ర బోగీ కారాగారం (ICF) జనరల్ మేనేజర్ ను ఆదేశించిన రైల్వేబోర్డు.
వలిగొండ వద్ద రేపల్లె-సికింద్రాబాద్ (డెల్టా) ఫాస్ట్ ప్యాసింజర్ ప్రమాదానికి గురై నేటికి 17 సంవత్సరాలు.
గుంటూరు డివిజన్ పరిధిలో 29-అక్టోబర్-2005న జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన విచారణలో, పలు విభాగాల మధ్య సమన్వయ లేమి సహా, భద్రతా పరమైన అనేక దిద్దుబాటు చర్యలు వెలుగులోకి వచ్చాయి.
తక్షణ వర్తింపుతో, గుంటూరు నగర శివార్లలో ఉన్న పేరేచర్ల మరియు నంబూరు రైల్వేస్టేషన్ల నుండి పార్సిల్, లగేజి రవాణా అనుమతించబడినది.
ఈ స్టేషన్ల నుండి ఎండుమిర్చి తదితర ఉత్పత్తులు పార్సిల్ వ్యాన్ల ద్వారా రవాణా చేయటం వల్ల, రెడ్డిపాలెం గూడ్స్ షెడ్ వద్ద రద్దీ, ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.
గుంటూరు మీదుగా నడిచే, రైలు నం. 07221/07222 కాకినాడ-లోకమాన్యతిలక్ టెర్మినస్-కాకనాడ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు, 10-నవంబర్-2021 నుండి LHB బోగీలతో నడవనున్నది.
బోగీల వివరాలు
ఫస్ట్ ఏసి - 1
ఏసి టూటైర్ - 2
ఏసి త్రీటైర్ - 5
స్లీపర్ - 7
సెకండ్ సిట్టింగ్ - 3
పవర్ కార్ - 2
మొత్తం - 20 బోగీలు
నూతన LHB బోగీల కేటాయింపు/లభ్యతకు అనుగుణంగా, ఈ సంవత్సరాంతంలోగా రైలు నం. 12727/12728 విశాఖపట్నం-హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు, ప్రస్తుతం ఉన్న ఉత్కృష్ట్ బోగీల స్ధానంలో LHB బోగీల ఏర్పాటుకై దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించినది.
నేటి నుండి అధిక సామర్థ్యం కలిగిన 20 (LHB) పార్సిల్ వ్యాన్ లతో రాకపోకలు ప్రారంభించిన, రైలు నం. 00623/00778-00779/00624 వాస్కొడగామా/కాచిగూడ-న్యూగౌహతి- కాచిగూడ/వాస్కొడగామా ప్రత్యేక పార్సిల్ ఎక్స్ ప్రెస్ రైలు.
దీనివలన పార్సిల్ రవాణా సామర్థ్యం పెరగనున్నది.
రేపటి నుండి రైలు నం. 00623/00624 వాస్కోడగామా-న్యూగౌహతి-వాస్కోడగామా(వయా-కర్నూలు, కాచిగూడ, గుంటూరు) పార్సిల్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనున్నది. 10 LHB పార్సిల్ వ్యాన్లతో నడిచే ఈ రైలు, ప్రస్తుత రైలు నం. 00778/00779 కాచిగూడ-గౌహతి-కాచిగూడ పార్సిల్ ఎక్స్ ప్రెస్ రైలుకు అనుసంధానం చేయబడుతుంది.
దక్షిణమధ్యరైల్వే పరిధిలో పలు (23) ప్రధానరైళ్ల పునరుద్ధరణకు ఆమోదం తెలిపిన రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోచింగ్).
తదనుగుణంగా గుంటూరు డివిజన్ నుండి నడవనున్న ప్రత్యేక రైళ్లు
కాచిగూడ-రేపల్లె-సికింద్రాబాద్
గుంటూరు-రాయగడ-గుంటూరు
సికింద్రాబాద్-గుంటూరు-సికింద్రాబాద్ (వయా-ఖమ్మం)
తెనాలి-గుంటూరు మధ్య డబుల్ లైన్ అందుబాటులోకి వచ్చిన అనంతరం, ఈరోజు మధ్యాహ్నం ఈ మార్గంలో రాకపోకలు సాగించిన తొలి రైలు - 16031 చెన్నై-శ్రీ మాతావైష్ణోదేవి కాత్రా అండమాన్ ఎక్స్ ప్రెస్.
@gntrailusersasn
@drmgnt
@IndianRailUsers
నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గ నిర్మాణ రెండో దశ పనులలో భాగంగా, గుండ్లకమ్మ-కనిగిరి మధ్య సుమారు 80 కిలోమీటర్ల మేర గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు, సుమారు 431.57 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, తిరిగి ప్రారంభం కానున్నవి.
సుమారు 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ పనులు పూర్తయ్యే అవకాశం.
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా, రైలు నం. 17261/17262 గుంటూరు-తిరుపతి-గుంటూరు (వయా-నంద్యాల) ఎక్స్ ప్రెస్ రైలుకు, శాశ్వత ప్రాతిపదికన రెండు అదనపు స్లీపర్ క్లాస్ (S3,S4) బోగీలు ఏర్పాటు చేయబడినవి.
ఈ ఏర్పాటు తక్షణమే (ఈ రోజు నుండి) అమలులోకి వచ్చినది.
@PRATIKD67907643
@jubsbasha
@gntrailusersasn
Basis it's occupancy during past 15 days, feasibility of augmenting this train atleast with another 2 sleeper coaches, is taken up with concerned officials.
In this regard, subject to operational feasibility, concerned officials are likely to take appropriate decision very soon.
గూడ్స్ రైళ్ళ లోకోమోటివ్(ఇంజన్)ల సామర్ధ్యాన్ని పెంచే దిశగా చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ కృషి అభినందనీయం.
ప్రస్తుతం ఉన్న అధునాతన WAG9 లోకోమోటివ్ సామర్థ్యాన్ని, 6 వేల అశ్విక శక్తి నుండి 9 వేల అశ్విక శక్తికి పెంచటం, గూడ్స్ రైళ్ళ రవాణాలో చాలా సానుకూల పరిణామం.
Good job
@Clwrailindia
మిర్యాలగూడ, నడికుడి మీదుగా 24 బోగీలతో నడవనున్న, రైలు నం. 07509/07510 హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.
ఆయా స్టేషన్లలో తిరుపతి నుండి వచ్చే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ హాల్ట్ ఉపసంహరణ వల్ల తలెత్తిన అసౌకర్యానికి, కొంతమేర తాత్కాలిక ఉపశమనం.
మిర్యాలగూడ, నడికుడి మీదుగా నడవనున్న, రైలు నం. 07426/07427 పూర్ణ-తిరుపతి-పూర్ణ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు.
ఆయా స్టేషన్లలో తిరుపతి నుండి వచ్చే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ హాల్ట్ ఉపసంహరణ వల్ల తలెత్తిన అసౌకర్యానికి, కొంతమేర తాత్కాలిక ఉపశమనం.
గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ పనులలో భాగంగా, దిగువమెట్ట-గాజులపల్లి ఘాట్ మార్గంలో పనులు త్వరితగతిన చేపట్టేలా చూడాలని, మరియు నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద పిట్ లైన్ నిర్మాణం చేపట్టాలని గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ మోహన్ రాజా గారిని కోరటమైనది.
గుంటూరు యార్డు రీమోడలింగ్ కు సంబంధించి టెలికాం ఏర్పాట్ల కొరకు, రూ. 5.71 కోట్ల అంచనా వ్యయంతో, పనులు త్వరలో ప్రారంభం కానున్నవి.
దీనితో, సుమారు రూ. 76.90 కోట్ల అంచనా వ్యయంతో, క్రింద పేర్కొనబడిన విధంగా, వివిధ పనులు త్వరలో ప్రారంభం కానున్నవి.
గుంటూరు యార్డు రీమోడలింగ్ కు సంబంధించి -
భవనాల పనులకు - రూ. 29.47 కోట్లు
విద్యుద్దీకరణ పనులకు - రూ. 12.10 కోట్లు
వంతెనల పనులకు - రూ. 9.06 కోట్లు
ట్రాక్ పనులకు - రూ. 6.54 కోట్లు
అంచనా వ్యయంతో సంబంధిత పనులు త్వరలో ప్రారంభం కానునన్నవి.
ప్రస్తుత రద్దీ & వేసవి సెలవుల ముగింపు నేపధ్యంలో మరింతగా పెరగనున్న రద్దీ దృష్ట్యా, సురక్షిత ప్రయాణానికి వీలుగా -
గుంటూరు-విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్
గుంటూరు-రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్
రైళ్లను పునరుద్ధరించాలని సంబందిత అధికారులను కోరడమైనది.
విజ్ఞప్తి అందిన వెనువెంటనే స్పందించి, గుంటూరు రైల్వేడివిజన్ లోని పలు రైల్వేస్టేషన్ల నుండి చెన్నై వెళ్ళే ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా, 22-సెప్టెంబర్-2024 నుండి వర్తింపుతో, రైలు నం. 12604 హైదరాబాద్-చెన్నై ఎక్స్ ప్రెస్ రిజర్వేషన్ కోటా సవరించిన సంబంధిత ఉన్నతాధికారులకు ధన్యవాదములు.
10-నవంబర్-2023 నుండి వర్తింపుతో, రైలు నం. 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు రిజర్వేషన్ కోటా క్రింద పేర్కొనబడిన విధంగా సవరించబడినది.
రాజమండ్రి నుండి రద్దీ అధికంగా ఉన్న నేపధ్యంలో, ఈ సవరణ వల్ల సీట్ల లభ్యత గణనీయంగా పెరగనున్నది.
రైలు నం. 07387/07388 హుబ్లి-నహర్లగున్ (అరుణాచల్ ప్రదేశ్)-హుబ్లి ప్రత్యేక రైలునకు -
గిద్దలూరు
మార్కాపూర్ రోడ్
వినుకొండ
నరసరావుపేట
ఏలూరు
సామర్లకోట
రైల్వేస్టేషన్లలో అదనపు నిలుపుదలల ఏర్పాటుకు తక్షణమే స్పందించిన, సంబంధిత రైల్వే ఉన్నతాధికారులకు ధన్యవాదములు.
విశాఖపట్నం-కర్నూలు మధ్య రైల్వే కనెక్టివిటీ పెంపుదల సహా, ప్రతిపాదిత మూడు రాజధానుల మధ్య రైళ్ళ ప్రతిపాదనల గురించి ఇటీవల రాజ్యసభలో అడగబడిన ప్రశ్నకు, రైల్వే మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారి లిఖితపూర్వక సమాధానము క్రింది విధంగా ఉన్నది.