హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా వైరస్ బాధితులకు అండగా నిలిచారు. వైరస్ బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు..ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షల చొప్పున, ప్రధానమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయలు సహాయం చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
కరోనా: రామ్చరణ్ రూ.70 లక్షలు విరాళం.
కరోనా వైరస్పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయం అందించడానికి ప్రముఖ హీరో రామ్చరణ్ ముందుకొచ్చారు. ఈ సంక్షోభ సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్ఫూర్తితో రూ. 70 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
కరోనా: పారాసిట్మాల్తో అద్భుత ఫలితం.
బాధితులపై పారాసిట్మాల్ ప్రయోగించిన కేరళ.
పూర్తిగా అదుపులోకి వస్తోందంటున్న వైద్యులు.
పారాసిట్మాల్తో విజయం సాధిస్తున్న కేరళ.
కేరళ బాటలో మరిన్ని రాష్ట్రాలు.
చేతిలో నెల రోజుల బిడ్డతో..
పండంటి బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు కూడా కాలేదు.. అయినా కరోనాపై పోరాడేందుకు విధుల్లో చేరారు. సెలవు తీసుకునే వెసులుబాటును పక్కకు పెట్టి.. మాతృత్వాన్ని, వృత్తి ధర్మాన్ని సమానంగా భావించి కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్నారు విశాఖ జీవీఎంసీ కమిషనర్ జి సృజన.
ఈఎస్ఐ అక్రమాలపై దర్యాప్తునకు జనసేన డిమాండ్.
ఈఎస్ఐలో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటివరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు చేయాలని జనసేన డిమాండ్ చేసింది. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటివారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపింది.
బాహుబలిని బ్రేక్ చేసిన మహేష్ చిత్రం.
ఉగాది కానుకగా ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం అత్యధిక టీఆర్పిని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 22.70 టీఆర్పితో బాహుబలి-2 అగ్రస్థానంలో ఉండగా..తాజాగా
#SarileruNeekevvaru
23.4 టీఆర్పిను సాధించి గత రికార్డులన్నింటిని తిరగరాసింది
మరోసారి బుల��లితెరపై ఎన్టీఆర్ సందడి.
లాక్డౌన్ కొనసాగుత్ను వేళ..చాలామంది ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో జనాన్ని అలరించడానికి స్టార్ మా మ్యూజిక్ ఛానల్లో నేటి నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లితెరపై అభిమానులను అలరించిన బిగ్బాస్ తెలుగు సీజన్-1ను పున: ప్రసారం చేయనుంది.
తూర్పుగోదావరి: అల్లవరం మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కుంచె ప్రదీప్, నాగజ్యోతిల నెల రోజుల బాబుకి గుండెశస్త్ర చికిత్సకు ప్రముఖ హీరో మహేష్బాబు సహకరించి నిజజీవితంలో రియల్ హీరో అయ్యాడు. కృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని ఆంధ్ర ఆస్పత్రిలో బాబుకు గుండె శస్త్రచికిత్స చేయించారు
ఐ లవ్ యూ.. జగనన్నా: వాలంటీర్ భావోద్వేగం.
ఐ లవ్ యూ.. జగనన్నా.. స్పీచ్ లెస్ అన్నా. ఒక పేదవాడికి మన ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్లాలి అని దూరంగా ఆలోచించి మమ్మల్ని వాలంటీర్లుగా ఎన్నుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి అని పెట్టి దోచుకుంది. మాకు మీరు 50 కుటుంబాలు అప్పజెప్పారు.
పవన్ అభిమానికి సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం.
తాడేపల్లి: రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పవన్ కల్యాణ్ అభిమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షలు మంజూరు చేశారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర సేవలు అందించే అంబులెన్స్లను అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. గత 3 నెలలుగా కరోనా టెస్టుల విషయంలోనూ ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ఏపీ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు కూడా అభినందనీయంగా ఉంది - పవన్ కల్యాణ్
కూకట్పల్లిలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు.. అలవాటులో పొరపాటుగా టంగ్ స్లిప్ అయ్యారు. కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ను ఓడించండి.. తరమికొట్టండి’ అని.. కొన్ని వేల సభలో చెప్పి ఉంటారు. ఇప్పుడు ఉన్న పలానా ఆ మాట మార్చాలంటే.. ఆ నాలుక సహకరించాలి కదా!
తల్లడిల్లిన తల్లి గుండె.
అమ్మ ప్రేమకు అంతులేదు. తనయుడు వేరే రాష్ట్రంలో చిక్కుకున్నాడని తెలియగానే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. అధికారుల అనుమతి తీసుకుని, బోధన్ నుంచి నెల్లూరుకు స్కూటీపై వెళ్లి తనయుడిని చేరుకుంది. సుమారు 1,400 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి తీసుకుని వచ్చింది.
టాక్ఆఫ్ ది టాలీవుడ్గా 81 అడుగుల కటౌట్.
హైదరాబాద్లోని మహేష్ బాబు అడ్డాగా పేరుగాంచిన సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబందించి 81 అడుగుల మహేష్ బాబు కటౌట్ని థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ కటౌట్ ప్రస్తుతం టాక్ఆఫ్ ది టాలీవుడ్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ప్రశంసలు కురిపించింది. విశాఖ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం గొప్పగా వ్యవహరించిందని.. మృతి చెందిన కుటుంబాలకు రూ.కోటి తక్షణ పరిహారం ఇవ్వడం గొప్ప విషయమని, ప్రభుత్వం మానవతా దృక్పథం, దయార్థ హృదయాన్ని అభినందిస్తున్నామని వ్యాఖ్యానించింది.
'అజ్ఞాతవాసి' సినిమా ఆన్లైన్లో ఆల్టైం రికార్డ్లను సెట్ చేస్తోంది. అజ్ఞాతవాసి హిందీ డబ్బింగ్ వర్షన్ను 'ఎవడు 3' పేరుతో యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కేవలం 2 రోజుల్లోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ ఘనత సాధించి తొలి దక్షిణాది చిత్రంగా రికార్డ్ సృష్టించింది.
కరోనాపై వార్: ప్రభాస్ రూ.కోటి విరాళం.
కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన వంతు బాధ్యతగా కోట��� రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్, తెలంగాణ రిలీఫ్ ఫండ్కి అందజేస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించారు.
పవన్ కల్యాణ్ లాగా ఓట్లు కోసం రాజకీయాలు చేయడం మాకు తెలియదు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన పిల్లలు క్రిస్టిన్ అన్నారు. ఎన్నికలు తరువాత హిందువులు అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ని రెండు చోట్ల ఓడించారు - వెల్లంపల్లి శ్రీనివాస్
మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్కి వ్యక్తిత్వమే లేదు. ఆనాడు మాతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్.. నేడు ప్రధాని మోదీ కాళ్లు మొక్కుతున్నారు - కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
కరోనాపై పోరాటానికి మహేష్ బాబు రూ.కోటి విరాళం.
హైదరాబాద్: కరోనా పోరాటంలో భాగంగా ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ ప్రముఖులు తమ వంతు సహాయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.కోటి విరాళం ప్రకటించారు.
వైఎస్ జగన్ దంపతులకు కేసీఆర్ ఘన స్వాగతం.
వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్తో సమావేశం అయ్యారు. జగన్కు కేసీఆర్తో పాటు తెలంగాణ మంత్రులు స్వాగతం పలికారు. సతీసమేతంగా వైఎస్ జగన్ ప్రగతి భవన్కు రాగా.. కేసీఆర్ పుష్పాగుచ్చాలిచ్చి.. జగన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు.
కొడుకుని హత్తుకుని విజయమ్మ భావోద్వేగం.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి, తొలి ప్రసంగం చేసిన వైఎస్ జగన్ని చూసి విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ను దగ్గరకు తీసుకుని తన హృదయానికి హత్తుకున్నారు. తల్లిని అక్కున చేర్చుకుని, కన్నీళ్లు తుడిచి ఓదార్చారు.
విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేసి అమ్మేస్తున్నారు. ఇవాళ విశాఖ ఉక్కుపై పడ్డారు.. రేపు సింగరేణిని కూడా ప్రైవేట్పరం చేస్తామంటారు. ఏపీ విషయంలో నోరు మూసుకుని కూర్చోం. రేపు తెలంగాణకు కష్టం వస్తే మా వెంట ఎవరుంటారు? మేం మొదట భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ బిడ్డలం - కేటీఆర్
మదనపల్లె: సోనూసోద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారి తమవంతు సాయం చేస్తున్న ఇద్దరు కూతుళ్ల వీడియోను చూసి చలించిపోయారు. గంటల వ్యవధిలోనే ఆ కుటుంబానికి రూ.8లక్షల విలువైన ట్రాక్టర్, రొటావేటర్ను బహూకరించి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు
కాపు ఉద్యమ నేత ముద్రగడ ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసింది నిజం కాదా? అప్పుడు పవన్�� కల్యాణ్ కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా? - అవంతి శ్రీనివాస్
కత్తి మహేష్ అరెస్ట్.
సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను టాలీవుడ్ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్ సెక్షన్ 153(ఎ) కమ్యూనల్ యాక్ట్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్ జగన్ పాలనపై ప్రభాస్ కామెంట్.
నాకు పాలిటిక్స్ అంతగా తెలియవు. అయితే, ఓ యువనేతగా జగన్ ఏపీని అభివృద్ది పథంలో నడిపిస్తారనే నమ్మకం ఉంది. సీఎంగా జగన్ పనితీరు బాగుంది. వైఎస్ జగన్ పాలనలో ఏపీ ఇంకా బాగుంటుందనుకుంటున్నా: చెన్నైలో తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్
పవన్ కల్యాణ్ చేస్తున్న కొన్ని ట్వీట్లు బాధ్యత రహితంగా ఉన్నాయి. వాలంటీర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం సరికాదు. వాలంటీర్లు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు.. వారి పనితీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది - అంబటి రాంబాబు
నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా ఎలా ఇవ్వాలనే ఆలోచిస్తాం - వైఎస్ జగన్
బామ్మ కోరిక తీర్చిన మహేష్ బాబు.
వృద్దురాలి కళ్లల్లో ఆనందం చూసిన మహేష్ బాబు.
మహర్షి మూవీ సెట్ కు వచ్చిన వృద్దురాలు.
మహేష్ బాబును కలవాలని ఆశపడ్డ వృద్దురాలు రేలంగి సత్యవతి.
వృద్దురాలితో చాలాసేపు ముచ్చటించిన మహేష్.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి బోషడీకే అనే పదాన్ని ఎలా వివరించాలో అర్థంగాక ఎంతో సతమతమయ్యాం. చివరకు ఆయన అర్థం చేసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు - విజయసాయిరెడ్డి
ప్రియాంక హత్యపై అసభ్య పోస్ట్లు: కేసు నమోదు.
ప్రియాంక హత్య కేసు నిందితులకు మద్దతు తెలుపుతూ బాధితురాలను కించపరిచేలా స్మైలీ నాని అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అమ్మాయిలను అత్యాచారం చేస్తే తప్పులేదంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఉదంతంపై రాచకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు
పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటాం. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలి - మాధవీలత, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందులలో తుదిశ్వాస విడిచారు.
సోషల్ మీడియా యోధులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. YSRCP గెలుపు కోసం మీరు ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఎల్లో మీడియా తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వైఎస్సార్సీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నా - జగన్
తర్వాతి చిత్రం మహేష్తోనే.. జక్కన్న క్లారిటీ.
రౌద్రం రణం రుధిరం తర్వాత తన తదుపరి చిత్రం టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని దర్శక ధీరుడు
#SSrajamouli
స్పష్టం చేశారు. ఈ సినిమాపై జక్కన్న తొలిసారి స్పందించడంతో
#MaheshBabu
ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సూపర్ స్టార్ మహేష్బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మహేష్బాబు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చారు.
#HBDYSJagan
#MaheshBabu
జనసేనలో ఒకే ఒక్కడు.. అయినా వరుస అవమానాలు.
రాపాక వరప్రసాద్కు జనసేన పార్టీలో వరుస అవమానాలు.
గెలిచిన ఏకైక ఎమ్మెల్యేకూ అవమానాలు తప్పటం లేదా?
మీటింగ్కు లేటుగా వచ్చారని రాపాకను మందలించిన నాదెండ్ల.
పవన్, నాదెండ్ల పెత్తనంపై జనసేనలో అసంతృప్తి సెగలు.
వరుసగా జనసేనను వీడుతున్న నేతలు.
సీఎం వైఎస్ జగన్ వాహనశ్రేణి అంబులెన్స్కు దారి ఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన జగన్.. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. ఈ క్రమంలో గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అంబులెన్స్కు దారి ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు.
మా ఎన్నికలు: కృష్ణను కలిసిన మోహన్బాబు, విష్ణు.
మంచు విష్ణు తన ప్యానల్తో కలిసి సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. మంచు విష్ణు వెంట మోహన్బాబు కూడా ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కృష్ణను మోహన్బాబు, విష్ణులు కోరారు. దీనికి కృష్ణ స్పందిస్తూ.. విష్ణుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
జగన్ మాట ఇచ్చారంటే.. నిలబెట్టుకుంటారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారు. జగన్ మాట ఇచ్చారంటే కచ్చితంగా నిలబెట్టుకుంటారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారు - వల్లభనేని వంశీ, గన్నవరం ఎమ్మెల్యే
నాకు భర్త, ఇద్దరు పిల్లలు. ఇప్పుడు నాకు ఉచిత రేషన్ సరుకుల వాహనం మంజూరైంది. శ్రీకాకుళంలో ఇవాళ ఈ వాహనాన్ని నడుపుకుంటూ వెళుతుండటం ఆనందంగా ఉంది. బతుకుపై మరింత భరోసా కలిగింది. ఇందుకు కారణమైన జగనన్నకు కోటి వందనాలు - సవర సుహాసిని, ఎస్.బాణాపురం, మెలియాపుట్టి మండలం, శ్రీకాకుళం జిల్లా
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హవా మరింత పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ మళ్లీ భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించడం ఖాయం. ఏడాదిగా ముఖ్యమంత్రి జగన్ అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి తిరుగులేని మద్దతు లభిస్తోంది - సీపీఎస్ సర్వే
తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం.
ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే రిజర్వేషన్లు.
ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ 7.5శాతం రిజర్వేషన్ బిల్లు.
బిల్లును స్వాగతించిన ప్రతిపక్ష అన్నాడీఎంకే.
టీడీపీ, జనసేన భూ వివాదం: ఒకరి మృతి.
రూ.2 కోట్ల విలువైన స్థలం విషయంలో చెలరేగిన వివాదం.
టీడీపీకి చెందిన సందీప్, జనసేనకు చెందిన పండు గ్యాంగ్ల మధ్య ఘర్షణ.
కర్రలు, కత్తులతో దా��ులు, ప్రతి దాడులు.
ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్ చికిత్స పొందుతూ మృతి.
ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.
టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు అత్యంత విలువైనవి. పరీక్షలు లేకుండా పాస్ చేస్తే వాటికి విలువ ఉంటుందా? అందుకే కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు జరపాలనుకుంటున్నాం. దీన్ని కూడా రాజకీయం చేస్తారా - కురసాల కన్నబాబు
జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సాయంగా బాధితుల కోసం రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
చంద్రబాబు గారూ.. మన రాష్ట్రం ఏమైపోతోంది. ఈ వయసులో మీ పార్టీ కార్యకర్తలను మీరు అదుపు చేయలేరా? బుద్ధి లేని మీ పార్టీ గాడిదలకు చెప్పండి. ఇంత నీచమైన స్థితికి మీ పార్టీ కార్యకర్తలు దిగజారిపోయారు. ప్రజల చేత ఛీ అనిపించుకోకండి. చరిత్ర హీనులు కాకండి - కేఏ పాల్
వలంటీర్లా.. ఉరూరా ఇంతమంది ఎందుకు? వాళ్లందరూ ఏం చేస్తారు? వారికి జీతాలు ఇవ్వడం వృధా అని ఎద్దేవా చేసిన వారు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఆంధ్రప్రదేశ్లో ఆదిలోనే అదుపు చేయడానికి దాదాపు 2.5 లక్షల వలంటీర్లు నిర్విరామంగా శ్రమిస్తున్నారు
ఆర్టీసీ విలీనానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.
ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు అంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు
వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎలా అయితే ప్రజల గుండెల్లో దేవుడులా చిరస్థాయిగా నిలిచారో.. అంతేస్థాయిలో వైఎస్ జగన్ కూడా ప్రజలకు సేవ చేస్తూ అందరి హృదయాల్లో నిలిచిపోతారు. ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ స్థానంలోకి తీసుకు వెళతారు - పోసాని కృష్ణ మురళి
లోక్సభ స్పీకర్ స్థానంలో ఎంపీ మిథున్రెడ్డి.
న్యూఢిల్లీ: వైఎస్సార��� కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్సభ నిర్వహించారు. లోక్సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన.. ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు.
ఇలాంటి కష్ట సమయాల్లో విశాఖ గ్యాస్ లీక్ వార్త వినాల్సి రావడం గుండెను కలిచివేసింది. ఈ ప్రమాదంలో మరణించినవారికి సంతాపం తెలియజేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. వారి కోసం నేను ప్రార్థిస్తున్నాను. స్టే సేఫ్ వైజాగ్ - మహేష్ బాబు
నేను ఈ రంజాన్ మాసంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలున్నారు. ఈ ఎన్నికల్లో ఐదుగురికి టికెట్ ఇస్తే.. నలుగురు గెలుపొందారు. ఓడిపోయిన ఇక్బాల్ను కూడా త్వరలోనే ఎమ్మెల్సీగా చేస్తాము - వైఎస్ జగన్, ఏపీ సీఎం.
గుండెపోటు వస్తే హైదరాబాద్లో.. అపోలో లేదా కేర్ హాస్పిటల్కు తీసుకువెళ్తారు.. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్కు కోడెల శివప్రసాదరావును ఎందుకు తీసుకెళ్లారు? కోడెల మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి - బొత్స సత్యనారాయణ